
- వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్లో రెండు రోజుల కింద ఘటన
- వీడియో వైరల్ కావడంతో ఇద్దరిపై చర్యలకు రంగం సిద్ధం
కాశీబుగ్గ(కార్పొరేషన్)/వరంగల్ సిటీ, వెలుగు : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేసే ఇద్దరు ఉద్యోగులు సర్కార్ ఆఫీస్ లో రాసలీలల్లో మునిగిపోయారు. రెండు రోజుల కింద జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. రెండు రోజుల కింద మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ సమయం ముగియడంతో సిబ్బంది మొత్తం వెళ్లిపోయారు. అకౌంట్స్ విభాగానికి చెందిన ఇద్దరు ఉద్యోగులు మాత్రం అక్కడే ఉండి ఆఫీస్లోనే రాసలీలల్లో మునిగారు.
ఈ ఘటన మొత్తాన్ని ఓ వ్యక్తి వీడియో తీయడంతో వైరల్ అయింది. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు ఇద్దరు ఉద్యోగులపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. రాసలీలల్లో మునిగిన వారిలో ఇటీవల సిరిసిల్ల జిల్లా నుంచి వచ్చిన ఓ మహిళా ఉద్యోగితో పాటు అయినవోలు మండల కేంద్రానికి చెందిన మరో ఉద్యోగి ఉన్నట్లు సమాచారం.